హైదరాబాద్ : దేశ రాజధాని ఢిల్లీలో కేంద్ర ఎన్నికల కమిషన్ సభ్యుడు అనూప్ చంద్రపాండేతో రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు, రాష్ట్ర హైకోర్టు అడిషనల్ జనరల్ రాంచందర్రావు మంగళవారం సమావేశమయ్యారు. రాష్ట్రంలో మునుగోడు అసెంబ్లీ స్థానానికి జరుగుతున్న ఉప ఎన్నికల్లో పోటీ చేస్తున్న ఓ స్వతంత్ర అభ్యర్థికి రోడ్డు రోలర్ గుర్తు కేటాయించడంపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ కేంద్ర ఎన్నికల కమిషన్ అధికారులకు బీ(టీ)ఆర్ఎస్ పక్షాన లేఖను అందజేశారు. కారు గుర్తును పోలి ఉన్న రోడ్డు రోలర్ గుర్తును మునుగోడు అసెంబ్లీ ఉప ఎన్నికల పోటీ జాబితా నుంచి తొలగించాలని కోరారు. పార్టీ అభ్యంతరంతో 2011లో రోడ్డు రోలర్ గుర్తును తొలగించిన విషయాన్ని కేంద్ర ఎన్నికల కమిషన్ ఉన్నతాధికారుల దృష్టికి వినోద్కుమార్, రాంచందర్రావు తీసుకువచ్చారు.