హైదరాబాద్ : ప్రతి ఒక్కరు తమ వంతు బాధ్యతగా మొక్కలు నాటి వృక్ష సంపదను పెంచాలని ప్రణాళిక సంఘం వైస్ ప్రెసిడెంట్ బోయినపల్లి వినోద్ కుమార్ అన్నారు.
గ్రీన్ఇండియా చాలెంజ్ కార్యక్రమంలో భాగంగా.. తన జన్మదినాన్ని పురస్కరించుకొని శ్రీ శైలం మల్లికార్జున స్వామి సన్నిధానంలో తన సతీమణి బోయినిపల్లి మాధవితో కలిసి మొక్కలు నాటారు.
ఈ సందర్భంగా వినోద్ కుమార్ మాట్లాడుతూ.. గ్రీన్ఇండియా చాలెంజ్లో పాల్గొని మొక్కలు నాటడం సంతోషంగా ఉందని అన్నారు. సీఎం కేసీఆర్ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన హరిత హారానికి మద్దతుగా గ్రీన్ ఇండియా చాలెంజ్ కార్యక్రమం చేపట్టి మొక్కలు నాటే విధంగా అందరిలో చైతన్యం కలిగిస్తున్నారు . ఇంత మంచి కార్యక్రమం చేపట్టిన ఎంపీ సంతోష్ కుమార్ను ఆయన ప్రత్యేకంగా అభినందించారు.