రాజన్న సిరిసిల్ల : తెలంగాణ ప్రభుత్వం నిర్మించిన నీటి పారుదల ప్రాజెక్టులకు జాతీయ హోదా(National Status ) కల్పించాలని కోరినా కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వంపట్టించుకోవడం లేదని రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు(Planning Board Vice Chairman) బోయినపల్లి వినోద్ కుమార్ కేంద్రంపై మండిపడ్డారు. జాతీయ హోదా కోరలేదని పార్లమెంట్లో కేంద్ర జలవనరుల శాఖ మంత్రి(Union Minister) చేసిన వ్యాఖ్యలను ఆయన తప్పుబట్టారు.
రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లంతుకుంట మండలంలో ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు. తెలంగాణ ప్రభుత్వం జాతీయ హోదా ఏనాడు కోరలేదని అనడం సరికాదని పేర్కొన్నారు. నీళ్లు ,నిధులు,నియామకాలు సాధించుకోవడం కోసమే తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమం జరిగిందని స్పష్టం చేశారు. నాడు నీటి పారుదల మంత్రి గా ఉన్న హరీశ్రావు(Minister Harish Rao) పలుమార్లు కేంద్రంలోని మంత్రులకు జాతీయ హోదా కోసం లిఖితపూర్వకంగా దరఖాస్తులు(Applications in writing) ఇచ్చిన విషయాన్ని గుర్తు చేశారు.
బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ స్పందించి ఇప్పటికైనా కేంద్ర మంత్రితో జాతీయ హోదాపై సమాధానం ఇప్పించాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర విభజనలో అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం పోలవరం ప్రాజెక్టుకు మాత్రమే జాతీయ హోదా కల్పించిందని పేర్కొన్నారు.