తిరుమల : తెలంగాణ రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్ చైర్మన్ బోయినపల్లి వినోద్ కుమార్, డాక్టర్ మాధవీ దంపతులు శనివారం తిరుమల ( Tirumala ) లో శ్రీ వేంకటేశ్వర స్వామిని దర్శించుకున్నారు. తన జన్మదిన సందర్భంగా దంపతులిద్దరూ ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి ఏడుకొండల స్వామి ఆశీర్వాదాలు తీసుకున్నారు.
తెలుగు రాష్ట్రాల ప్రజలందరూ సుఖ సంతోషాలతో, సుభీక్షంగా ఉండాలని కోరుకున్నానని తెలిపారు. శ్రీ వేంకటేశ్వర స్వామి ఆశీస్సులతో తెలంగాణ రాష్ట్రం సిద్దించిందన్నారు. ఆ మేరకు సీఎం కేసీఆర్ ( CM KCR ) కొంత కాలం క్రితం స్వామివారికి మొక్కులు తీర్చుకున్న విషయాన్ని గుర్తు చేశారు. స్వామి దీవెనలతో తెలంగాణ రాష్ట్రం శరవేగంగా అభివృద్ధి పథం ( Development )లో ముందుకు సాగుతోందని అన్నారు.
కరీంనగర్ నగరంలో నిర్మించనున్న శ్రీ వేంకటేశ్వర స్వామి ఆలయం నిర్మాణానికి అడిగిన వెంటనే రూ . 20 కోట్లు మంజూరు చేసిన తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్ వై.వీ. సుబ్బారెడ్డి, ఈవో ధర్మా రెడ్డికి ఆయన ధన్యవాదాలు తెలిపారు.