ములుగు : తెలంగాణ నయాగరా బొగత జలపాతం పర్యాటకులకు కనువిందు చేస్తున్నది. ఇటీవల కురిసిన వర్షాలతో నీటి ప్రవాహం పెరిగి చూపురులను ఆకట్టుకుంటున్నది. బొగత అందాలను చూసేందుకు పర్యాటకులతో పాటు చుట్టుపక్కల గ్రామాల వాసులు పెద్ద ఎత్తున తరలివస్తున్నారు. ములుగు జిల్లా వాజేడు మండలం చీకుపల్లి అటవీ ప్రాంతంలోని ఎతైన కొండల నుంచి జాలువారుతున్న జలపాతం అందాలను చూసేందుకు పర్యాటకులు తరలివచ్చారు. తమ వద్దనున్న కెమెరాలు, సెల్ఫోన్లలో బంధిస్తూ మురిసిపోయారు.