బోధన్, డిసెంబర్ 21: అమెరికాలో జరోడ్డు ప్రమాదంలో బోధన్కు చెందిన విద్యార్థి మృతి చెందాడు. రాకాసిపేట గౌడ్స్కాలనీకి చెందిన శంకర్గౌడ్, నీరజ దంపతుల కుమారుడు పంజాల నీరజ్గౌడ్ (23) అమెరికాలోని న్యూ హెవెన్ సిటీలో ఎంఎస్ చదువుతున్నా డు. తన స్నేహితుడు శ్రీధర్తో కలిసి ఈ నెల 16న బ్రిడ్జిపోర్టు ప్రాంతానికి వెళ్లి తిరిగి వస్తున్నారు.
దట్టమైన పొగమంచు ఆవరించడంతో కారు అదుపు తప్పి పోలీసు పెట్రోలింగ్ వాహనాన్ని ఢీకొట్టారు. తీవ్రంగా గాయపడిన ఇద్దరిని దవాఖానకు తరలిస్తుండగా, నీరజ్గౌడ్ మార్గమధ్యలో మృతి చెందాడు. శ్రీధర్ దవాఖానలో చికిత్స పొందుతున్నాడు.