వరంగల్ రూరల్ : నర్సంపేట మండలంలోని మాదన్నపేట చెరువులో ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి బోటింగ్ను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. మాదన్నపేట చెరువులోకి గోదావరి జలాలను తీసుకొస్తామని ప్రజలకు ఇచ్చిన మాట నిలబెట్టుకున్నామని అన్నారు. ఈ చెరువును పర్యాటక ప్రాంతంగా అభివృద్ధి చేసేందుకు ప్రభుత్వం నిర్ణయించినట్లు తెలిపారు. ఇందులో భాగంగా ప్రస్తుతం పర్యాటక శాఖ ఇక్కడ బోటింగ్ వసతి కల్పించినట్లు పేర్కొన్నారు. మాదన్నపేట చెరువును మినీ ట్యాంకుబండ్ గా తీర్చిదిద్దేందుకు రూ.4 కోట్లతో ప్రతిపాదనలు సిద్ధం చేశామని, ఈ ఏడాది పనులు కూడా చేపట్టనున్నట్లు వెల్లడించారు. నర్సంపేట మున్సిపల్ చైర్ పర్సన్ రజిని, వైస్ చైర్మన్ వెంకట్ రెడ్డితో పాటు కౌన్సిలర్లు, స్థానిక స్థానిక ప్రజా ప్రతినిధులు, టూరిజం శాఖ అధికారులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.