హైదరాబాద్, జనవరి 25 (నమస్తే తెలంగాణ): బీజేపీ లోక్సభ అభ్యర్థుల ఎంపిక తుది దశకు చేరిందని, వారం రోజుల్లో ప్రకటిస్తామని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్ర మంత్రి కిషన్రెడ్డి వెల్లడించారు. హైదరాబాద్లో గురువారం జరిగిన బీజేపీ పార్లమెంట్ నియోజకవర్గాల సన్నాహాక సమావేశంలో ఆయన మాట్లాడారు. ఎన్నికలకు సిద్ధం కావాలని కిషన్రెడ్డి కార్యకర్తలకు పిలుపునిచ్చారు. ఏ పార్టీతోనూ తా ము కలవాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు. వేరే పార్టీతో కుమ్మక్కయ్యారంటూ ప్రచారం చేసేవాళ్లను చెప్పుతో కొట్టే రోజులు వస్తాయని హెచ్చరించారు.
బీజేపీ అగ్గిలాంటి పార్టీ అని, తమను విమర్శించేటప్పు డు ఒళ్లు దగ్గరపెట్టుకోవాలని ఇతర పార్టీలకు సూచించారు. హైదరాబాద్ పార్లమెంట్ నియోజకవర్గంలో అసదుద్దీన్ ఒవైసీని ఓడించడం కోసం పనిచేయాలని కార్యకర్తలకు సూచించారు. హైదరాబాద్ ముస్లింలు మజ్లిస్ను ఓడించాలని చూస్తున్నారని, ముస్లిం మహిళలు ఈ దఫా బీజేపీకి ఓటేయడానికి ముందుకొస్తున్నారని తెలిపారు. ఈ నెల 28న అమిత్ షా తెలంగాణలో పర్యటిస్తారని, ‘ప్రొఫెషనల్ మహిళలతో’ జరిగే సభలో పాల్గొంటారని చెప్పారు.