హైదరాబాద్ : ప్రతిపక్షాల గొంతు నొక్కుతున్న బీజేపీ నియంతృత్వ చర్యలు ఇకపై చెల్లవని రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్(Minister Gangula) తెలిపారు. ఈడీ, సీబీఐ, ఐటీ సంస్థలను అడ్డం పెట్టుకుని ప్రతిపక్షాలపై దాడులకు పాల్పడుతూ ప్రజాస్వామ్య విలువలను కాలరాస్తుందని కేంద్రంపై మండిపడ్డారు.
కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ(Rahul Gandhi)పై నరేంద్ర మోదీ(Narendra Modi) ప్రభుత్వం అనర్హత వేటు దురహాంకారానికి నిదర్శనమని పేర్కొన్నారు. ప్రశ్నించే గొంతుకలను అడ్డుకొని రాజ్యంగ హక్కుల్ని కాలరాస్తున్న బీజేపీ ప్రభుత్వానికి రోజులు దగ్గరపడ్డాయని అన్నారు. దేశప్రజలు త్వరలోనే బీజేపీకి బుద్ధి చెపుతారని పేర్కొన్నారు. బీజేపీ దుర్మార్గ విధానాలను ప్రజల్లోకి బలంగా తీసుకెళతామన్నారు.