Balka Suman | ఎమ్మెల్సీ కవిత అరెస్టుపై అసత్య ప్రచారాలు చేస్తున్నారని బీఆర్ఎస్ నేత బాల్క సుమన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. బీజేపీ దుర్మార్గపు పాలన సాగిస్తోందని.. సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తామని మోదీ చెప్పలేదా అని ప్రశ్నించారు. దేశంలో అనేక ఘర్షణలకు బీజేపీ విధానం కారణమన్నారు. కర్ణాటక బీజేపీ ఎంపీ రాజ్యాంగాన్ని మారుస్తామని అన్నారని.. తెలంగాణ పుట్టుకను మోదీ అవమానించారన్నారు. తెలంగాణలో ఏడు మండలాలను ఆంధ్రాలో కలిపారని.. మోదీతో జోడీ కట్టకపోతే ఈడీ, సీబీఐ వస్తాయని ఆరోపించారు. ఉత్తర భారతంలో మోదీకి కొరకరాని కొయ్యగా మారిన అరవింద్ కేజ్రీవాల్ను అరెస్టు చేశారన్నారు.
దక్షిణ భారతంలో కేసీఆర్ కుమార్తె కవితను అన్యాయంగా జైలులో పెట్టారన్నారు. లిక్కర్ కేసులో ఉన్న మాగుంట శ్రీనివాస్ రెడ్డి ఏపీలో ఎన్డీఏ ఎంపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారన్నారు. అజిత్ పవార్, ప్రఫుల్ పటేల్, హిమంత బిశ్వ శర్మ, యామిని ఏపీలో సీఎం రమేశ్, కొత్తపల్లి గీత సుజనా చౌదరి, అమరీందర్ సింగ్, సువేందు అధికారి బీజేపీలో చేరగానే కేసులు మాఫీ చేశారన్నారు. బీజేపీ వాషింగ్ పౌడర్ నిర్మాగా మారిందన్నారు. ఢిల్లీ లిక్కర్ కేసులో ఏమి లేకపోయినా కక్ష కట్టి అరెస్టు చేశారన్నారు. కేసీఆర్ని ఏం చేయలేక కవితను అరెస్టు చేశారన్నారు. బీజేపీ మేనిఫెస్టోలో మొత్తం అబద్ధాలు ఉన్నాయన్నారు.
బీజేపీ అబద్ధాల ఫ్యాక్టరీగా మారిందని.. కేసీఆర్, అరవింద్ కేజ్రీవాల్ను తట్టుకోలేకనే అరెస్టులు చేశారన్నారు. లిక్కర్ కేసులో ఉన్న వాళ్లు బీజేపీకి చందాలు ఇచ్చారన్నారు. కాంగ్రెస్, బీజేపీ పార్టీలకు తెలంగాణ ప్రయోజనాకు అవసరం లేదన్నారు. తెలంగాణలో బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు కర్రు కాల్చి వాత పెట్టాలన్నారు. రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో ఎవరిని పట్టించుకోవడం లేదన్నారు. మోదీతో కుమ్మకై తెలంగాణలో బలహీన అభ్యర్థులను పెట్టారన్నారు. బడే భాయ్, ఛోటా భాయ్ ఒక్కటి అయ్యారని.. పార్లమెంట్ ఎన్నికల తర్వాత రేవంత్ రెడ్డి బీజేపీలో చేరుతారన్నారు.
శ్వేతపత్రాలు, కాళేశ్వరం, ఫోన్ ట్యాపింగ్ పేరుతో కాలం వెల్లదీస్తున్నారన్నారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో రేవంత్ రెడ్డికి మోదీ సహకారం అందించారన్నారు. బండి సంజయ్ని ఎందుకు అధ్యక్షుడుగా తొలగించారన్నారు. రైతుబంధును ఆపాలని రేవంత్ రెడ్డి సీఈసీకి ఫిర్యాదు ఇవ్వగానే రైతుబంధు ఆపారని.. బీజేపీని గెలిపించడానికి రేవంత్ రెడ్డి బలహీన అభ్యర్థులను పోటీలోకి దించారన్నారు. ధర్మపురి అరవింద్ రేవంత్ రెడ్డిని బీజేపీలోకి ఆహ్వానించి బయటపడ్డారన్నారు. బీఆర్ఎస్ పార్టీకి పది లోక్సభ స్థానాలు వస్తాయన్నారు. నిజామాబాద్తో సంబంధం లేకపోయినా లేకపోయినా జీవన్ రెడ్డికి ఎంపీ టిక్కెట్ ఇచ్చారన్నారు. పరాన్న జీవులకు రేవంత్ రెడ్డి టిక్కెట్లు ఇచ్చారన్నారు.