హైదరాబాద్, ఏప్రిల్ 12 (నమస్తే తెలంగాణ): గృహజ్యోతి దరఖాస్తుల నిలిపివేతకు ఎన్నికల కోడ్ కారణమన్న ప్రభుత్వ నిర్ణయం సరికాదని బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి రచనారెడ్డి ఆరోపించారు. ఇప్పటికే కొనసాగుతున్న పథకాన్ని ఆపాల్సిన అవసరం లేదని ఆమె తేల్చి చెప్పారు.
హైదరాబాద్లోని బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో శుక్రవారం ఆమె మీడియాతో మాట్లాడారు. అసెంబ్లీ ఎన్నికల్లో వందరోజుల్లో ఆరు గ్యారెంటీలను అమలు చేస్తామని కాంగ్రెస్ హామీ ఇచ్చిందని, ఒకటి కూడా పూర్తిగా అమలు చేయలేదని విమర్శించారు. స్టాఫ్ నర్సులకు రెండు నెలలుగా జీతాలే ఇవ్వడం లేదని ధ్వజమెత్తారు.