అందుకే హైదరాబాద్కు అగ్రనేతల పరుగులు
విద్యుత్తు శాఖ మంత్రి జగదీశ్రెడ్డి ఎద్దేవా
సూర్యాపేట, జూలై 1 (నమస్తే తెలంగాణ) : ‘దేశంలో ఎక్కడా విద్యుత్తు లేకపోవడంతో తెలంగాణలో బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలు నిర్వహించుకుంటుంది. ఈ పర్యటన కమలనాథులకు విజ్ఞానయాత్ర అనుభూతినిస్తుంది. తెలంగాణలో కేసీఆర్ ఎనిమిదేండ్లలో సాధించిన అద్భుతమైన ప్రగతి ఫలాలు వారి రాష్ర్టాల్లో అమలు పర్చుకునేందుకు మంచి అవకాశం’ అని విద్యుత్తుశాఖ మంత్రి జగదీశ్రెడ్డి అన్నారు. శుక్రవారం ఆయన సూర్యాపేటలో మీడియాతో మాట్లాడారు.
సీఎం కేసీఆర్ ఢిల్లీ వైపు చూస్తే కేంద్రం భయపడుతున్నదన్నారు. హస్తినకు ప్రయాణం ప్రారంభించకముందే బీజేపీ దండు హైదరాబాద్కు పరుగులు తీసిందంటే కేసీఆర్ శక్తి సామర్థ్యాలు ఏమిటో అర్థమై ఉంటుందని పేర్కొన్నారు. తెలంగాణలో బీజేపీది బలుపు కాదు.. వాపు మాత్రమేనని తేల్చిచెప్పారు. అభివృద్ధి, సంక్షేమం, పరిపాలనకు తెలంగాణ రోల్ మోడల్ అన్నారు.