హైదరాబాద్: అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్కు ముందే అభ్యర్థులను ప్రకటించి ప్రచారంలో అధికార బీఆర్ఎస్ (BRS) దూసుకుపోతుండగా.. విపక్షాలు ఇంకా అభ్యర్థులను ప్రకటించే పనిలోనే ఉన్నాయి. నామినేషన్లకు గడువు నేటితో ముగినున్న నేపథ్యంలో గురువారం రాత్రి కాంగ్రెస్ (Congress) పార్టీ తుది జాబితాను విడుదల చేయగా.. తాజాగా బీజేపీ (BJP) ఫైనల్ లిస్ట్ను ప్రకటించింది. 12 మంది అభ్యర్థుల పేర్లతో కూడిన జాబితను పార్టీ అధిష్ఠానం విడుదల చేసింది. దీంతో జనసేనతో (Jenasena) కలిపి రాష్ట్రంలోని మొత్తం స్థానాలకు అభ్యర్థులను ప్రకటించినట్లయింది.