హుస్నాబాద్, నవంబర్ 23: కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం కక్షపూరిత విధానాలకు పాల్పడుతున్నదని సీపీఐ జాతీయ కార్యవర్గ సభ్యుడు చాడ వెంకటరెడ్డి ఆరోపించారు.
బుధవారం ఆయన సిద్దిపేట జిల్లా హుస్నాబాద్లో మీడియాతో మాట్లాడారు. రాజ్యాంగాన్ని కాపాడాల్సిన గవర్నర్లను బీజేపీ ప్రభుత్వం తన రాజకీయ ప్రయోజనాలకు వాడుకుంటున్నదని మండిపడ్డారు.