హైదరాబాద్, జూన్ 28 (నమస్తే తెలంగాణ)/సుల్తాన్బజార్: అధికారమే లక్ష్యంగా, తెలంగాణలో ఎలాగైనా పట్టు సాధించడమే పరమావధిగా బీజేపీ హడావుడి, ఆర్భాటాలకు తెరలేపింది. మూడు రోజుల పర్యటన నిమిత్తం హైదరాబాద్ వచ్చిన బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ ఆదివారం పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు.
అనంతరం రంగారెడ్డి గ్రా మీణ జిల్లా బీజేపీ కార్యాలయాన్ని ప్రత్యక్ష్యంగానూ, ఆదిలాబాద్, ఆసిఫాబా ద్, నిర్మల్, కామారెడ్డి, సిద్దిపేట, మెదక్, వనపర్తి, నాగర్కర్నూల్ జిల్లాల కార్యాలయాలను వర్చువల్గానూ ప్రారంభించారు. పశ్చిమబెంగాల్లో కార్యకర్తల సంకల్పం వల్లే ఘనవిజయం సాధించామని, అదే స్ఫూర్తితో తెలంగాణలోనూ పోరాడాలని ప్రార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు.