Accident | నీలగిరి : నల్లగొండ జిల్లా కేంద్రంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో బీజేపీ జాతీయ సీనియర్ నాయకుడు ఓరుగంటి రాములు(79) మృతి చెందారు. శనివారం మధ్యాహ్నం సమయంలో తన కుమారుడి కారులో కలెక్టరేట్ సమీపంలోకి వచ్చి మెడికల్ షాపునకు నడుచుకుంటూ వెళ్తుండగా.. వేగంగా వచ్చిన టాటా ఏస్ వాహనం ఆయన్ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఓరుగంటి రాములు తలకు బలమైన గాయాలయ్యాయి. హుటాహుటిన ఆయన్ను ఆస్పత్రికి తరలించగా.. అప్పటికే మరణించినట్లు వైద్యులు తెలిపారు. కాగా, ఓరుగంటి రాములు మరణవార్త తెలిసి నల్గొండ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్రెడ్డి దిగ్భ్రాంతికి గురయ్యారు. ఆస్పత్రికి వెళ్లి రాములు పార్థివ దేహానికి నివాళులర్పించారు.
ఓరుగంటి రాములు 1983లో నల్లగొండ నుంచి బీజేపీ తరఫున ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయారు. ఎమర్జెన్సీ సమయంలో నాసా చట్టం కింద జైలుకు వెళ్లారు. ఏబీవీపీ, ఆర్ఎస్ఎస్, జనసంఘ్లో పలు కీలక పదవులు చేపట్టారు.