CM KCR | టీపీసీసీ చీఫ్ రేవంత్రెడ్డి కన్నా ముఖ్యమంత్రి కేసీఆర్ మేలని బీజేపీ ఎంపీ ధర్మపురి అరవింద్ అన్నారు. జగిత్యాల జిల్లా ఇబ్రహీంపట్నం మండల కేంద్రంలో కార్నర్ మీటింగ్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్ తెలంగాణ కోసం పదేళ్లు పోరాటం చేశారన్నారు. కేసీఆర్ పోరాటం చేసిన సమయంలో రేవంత్రెడ్డి తెలుగుదేశం పార్టీలో ఉన్నాడని.. తెలంగాణకు వ్యతిరేకంగా పని చేశాడని.. ప్రస్తుతం చంద్రబాబు చెప్పినట్లుగా చేస్తున్నాడన్నారు. చంద్రబాబుకు సంబంధించి నేతలంతా కాంగ్రెస్లోనే ఉన్నారన్నారు.
2018 ఎన్నికల్లో హైదరాబాద్ తానే కట్టానని చెప్పుకున్న చంద్రబాబు ఎక్కడ ఉన్నాడన్నారు. కాంగ్రెస్కు ఓటు వేస్తే.. తెలంగాణను తీసుకెళ్లి ఆంధ్రాలో ఉన్న టీడీపీ చేతిలో పెట్టినట్లేనంటూ వ్యాఖ్యానించారు. తెలంగాణను హోల్సేల్గా రేవంత్రెడ్డి అమ్మేస్తాడని.. గతంలో బాబుకోసం సంచులు మోసుకెళ్లాడంటూ అర్వింద్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎంపీ ధర్మపురి అర్వింద్ చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. ఎప్పుడూ వివాదాస్పద వ్యాఖ్యలతో వార్తల్లో నిలిచే అర్వింద్.. రేవంత్ రెడ్డి కంటే సీఎం కేసీఆర్ మంచోడని అనడం చర్చనీయాంశంగా మారింది. గతంలోనే అర్వింద్ సీఎం కేసీఆర్పై ఇలాంటి వ్యాఖ్యలే చేసిన విషయం తెలిసిందే.