హైదరాబాద్ : గోషామహల్ బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్పై కంచన్బాగ్ పోలీసు స్టేషన్లో కేసు నమోదైంది. అజ్మీర్ దర్గాపై అనుచిత వ్యాఖ్యలు చేశారన్న స్థానికుడి ఫిర్యాదుతో కేసు నమోదు చేసినట్లు పోలీసులు వెల్లడించారు. అయితే రాజాసింగ్ చేసిన వ్యాఖ్యలు యూట్యూబ్లో వైరల్ అయ్యాయి. ఈ వీడియో ఆధారంగా రాజాసింగ్పై పోలీసులకు ఫిర్యాదు చేయగా, కేసు నమోదు చేశారు. ఐపీసీ సెక్షన్ 295ఏ కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
దుబ్బాక బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్ రావుపై అబిడ్స్ పీఎస్లో కేసు నమోదైన సంగతి తెలిసిందే. జూబ్లీహిల్స్ అమ్నీషియా పబ్ సామూహిక లైంగికదాడి ఘటనలో బాలిక ఫోటోలు, వీడియోలను రఘునందన్ రావు బీజేపీ ఆఫీసులో విడుదల చేశారు. దీంతో ఆయనపై ఐపీసీ సెక్షన్ 228ఏ కింద కేసు నమోదు చేసినట్లు పోలీసులు వెల్లడించారు.