హైదరాబాద్, సెప్టెంబర్ 16 (నమస్తే తెలంగాణ): బీజేపీ ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేశ్రెడ్డి అసెంబ్లీ వేదికగా ఓ కీలక ప్రకటన చేశారు. తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాలని అనుకుంటున్నట్టు సభలో ప్రకటించారు. అసెంబ్లీ ప్రశ్నోత్తరాల సమయంలో మాట్లాడిన ఆయన.. తన నియోజకవర్గ సమస్యలను సర్కార్ పట్టించుకోవడంలేదని ఆవేదన వ్యక్తంచేశారు. మొత్తం లెక్కలు తీసుకొచ్చిన. మంథనికెంత? ములుగుకెంత? కొడంగల్కు ఎంత? ఎన్ని నిధులు తీసుకెళ్తున్నారో? అన్ని వివరాలు తెచ్చా’ అని చెప్పారు. చివరలో తనకు పది నిమిషాలు కేటాయించండి.. నేను రాజీనామా చేయాలనుకుంటున్నా.. అంటూ స్పీకర్ను వేడుకున్నారు.