ముషీరాబాద్, జూలై 11: ఉత్తరప్రదేశ్లో మనువాద ముసుగులో దళితులపై జరుగుతున్న దాడుల ఘటనలకు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్రెడ్డి సమాధానం చెప్పాలని టీఎస్ ఎమ్మార్పీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు వంగపల్లి శ్రీనివాస్ మాదిగ డిమాండ్ చేశారు. బీజేపీ అధికారంలో ఉన్న రాష్ర్టాల్లో దళితులపై దాడులు జరుగుతున్నా ఆ పార్టీ పెద్దలు నోరుమెదపకపోవడం సిగ్గుచేటని మండిపడ్డారు.
హైదరాబాద్ విద్యానగర్లోని ఆ సంఘం కార్యాలయంలో మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఇటీవల మధ్యప్రదేశ్లో గిరిజన వ్యక్తిపై అమానుష ఘటన మరువకముందే రాజస్థాన్లో దళిత ఉద్యోగితో చెప్పులు నాకించిన తీరు బీజేపీ దళితుల పట్ల అవలంబిస్తున్న విధానాలకు పరాకాష్ట అని ధ్వజమొత్తారు.