దేశభక్తులమని నిత్యం చెప్పుకునే బీజేపీ నాయకులు జాతీయ జెండాకు వందనం చేయకపోవడం చర్చనీయాంశంగా మారింది. శుక్రవారం నిర్మల్లో జరిగిన బీజేపీ బహిరంగ సభకు హాజరైన కేంద్ర హోంమంత్రి అమిత్షా సమక్షంలో ఈ నిర్వాకం చోటుచేసుకున్నది. అమిత్షా జాతీయ జెండాను ఎగురవేసి జాతీయగీతం పాడుతున్న సమయంలో వేదికపై ఉన్న నాయకులంతా జెండాకు వందనంచేయగా.. నిజామాబాద్ ఎంపీ అర్వింద్, బీజేపీ నేత జితేందర్రెడ్డి సెల్యూట్ చేయకుండా నిల్చున్నారు. వీరు ఇలా వ్యవహరించడంతో అక్కడ ఉన్న వారంతా ఆశ్చర్యం వ్యక్తంచేశారు.