కొల్లాపూర్, ఆగస్టు 27: నాగర్కర్నూల్ జిల్లాకు చెందిన బీజేపీ నేతలతోపాటు మాజీ మంత్రి జూపల్లి వర్గీయులు ఆదివారం బీఆర్ఎస్లో చేశారు. బీజేపీ గిరిజన మోర్చా జిల్లా అధ్యక్షుడు నర్సింహనాయక్, ఉపాధ్యక్షుడు రాత్లావత్ నర్సింహనాయక్ బీజేపీకి రాజీనామా చేసి.. తమ అనుచరులైన 30 మంది తో కలిసి హైదరాబాద్లో ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్రెడ్డి సమక్షంలో గులాబీ గూటికి చేరారు.
కొల్లాపూర్ నియోజకవర్గం పెంట్లవెల్లి మండలంలోని కొండూరుకు చెందిన 50 మంది కార్యకర్తలు, కొల్లాపూర్ పట్టణంలో జూపల్లి యువసేనకు చెందిన 95 మంది యువకులు ఎమ్మెల్యే బీరం సమక్షంలో కొల్లాపూర్ క్యాంప్ కార్యాలయంలో బీఆర్ఎస్లో చేరారు. ఎమ్మెల్యే బీరం మాట్లాడుతూ.. బీఆర్ఎస్లో చేరిన ప్రతి కార్యకర్తను కాపాడుకుంటామని భరోసా ఇచ్చారు. సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ సహకారంతో నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తామని చెప్పారు.