ఎస్డీఆర్ఎఫ్- స్టేట్ డిజాస్టర్ మేనేజ్మెంట్ ఫండ్: ఇది రాష్ర్టానికి చట్టబద్ధంగా రావాల్సిన నిధులు.
ఎన్డీఆర్ఎఫ్- నేషనల్ డిజాస్టర్ రిలీఫ్ ఫండ్: ప్రకృతి వైపరీత్యాలతో కష్టాల్లో ఉన్న రాష్ర్టాలను ఆదుకునేందుకు కేంద్రం చేయాల్సిన సాయం.
హైదరాబాద్, జులై 21 (నమస్తే తెలంగాణ): రాష్ర్టానికి వరద సాయం చేశామంటూ కేంద్రమంత్రి కిషన్రెడ్డి దుష్ప్రచారం చేయడంపై టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, ఐటీ, పరిశ్రమలశాఖల మంత్రి కే తారకరామారావు తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేశారు. ఇది కిషన్రెడ్డి తెలివితక్కువతనానికి నిదర్శనమంటూ ఘాటుగా స్పందించారు. ఈ మేరకు ఆయన గురువారం ఒక ప్రకటన విడుదల చేశారు. తెలంగాణ ప్రజలు కష్టంలో ఉన్నప్పుడు సాయం చేయాల్సింది పోయి కిషన్రెడ్డి తప్పుడు లెకలు చెప్తూ అవమానిస్తున్నారని మండిపడ్డారు. ‘ఎన్డీఅర్ఎఫ్కు, ఎస్డీఆర్ఎఫ్కు తేడా తెలియని వ్యక్తి కేంద్రమంత్రిగా ఉండటం దురదృష్టకరం’అని వ్యాఖ్యానించారు. ఎన్డీఆర్ఎఫ్ కింద కేంద్రం విడుదల చేసిన అదనపు నిధులపై సమాధానం చెప్పాలని తెలంగాణ ప్రజలు డిమాండ్ చేస్తే.. రాష్ర్టానికి రాజ్యాంగబద్ధ హకుగా వచ్చే ఎస్డీఆర్ఎఫ్ గణాంకాలను చెప్పి మోసం చేసే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు. తెలంగాణ పట్ల కేంద్రం చూపుతున్న వివక్ష నుంచి ప్రజల దృష్టిని మరల్చేందుకు కిషన్రెడ్డి నిర్లజ్జగా అబద్ధాలు చెప్తున్నారని మంత్రి కేటీఆర్ మండిపడ్డారు.
తెలంగాణకు దక్కిందేమిటి?
ఎలాంటి విపత్తులు లేకున్నా రాష్ర్టానికి రాజ్యాంగబద్ధంగా దకాల్సిన ఎస్డీఆర్ఎఫ్ (స్టేట్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫండ్)కు వచ్చే నిధులు తప్ప కేంద్రం నుంచి తెలంగాణకు దకింది ఏమిటో చెప్పాలని మంత్రి కేటీఆర్ డిమాండ్ చేశారు. రాష్ర్టానికి దకాల్సిన నిధులను కేంద్రం విడుదల చేసినట్టు చెప్పుకోవడం దౌర్భాగ్యం అని పేర్కొన్నారు. కేంద్రానికి తెలంగాణ చెల్లించే పన్నుల నుంచి వివిధ రాజ్యాంగబద్ధమైన పద్ధతుల్లో తిరిగి రాష్ర్టానికి దకే మార్గాల్లో ఎస్డీఆర్ఎఫ్ ఒకటని, ఈ విషయంపై కేంద్రమంత్రి కిషన్రెడ్డి మాటలు ఆయన అవగాహన లేమికి నిదర్శనమని కేటీఆర్ మండిపడ్డారు. రాష్ట్రంలో వరదలు, విపత్తులు వచ్చినప్పుడు ముఖ్యంగా హైదరాబాద్లో వరదలతో పాటు ప్రస్తుతం వచ్చిన వర్షాలు, వరదల నష్టంపై కేంద్రం సహాయం చేయాలని నిలదీస్తే తమకు అలవాటైన అబద్ధాలను కిషన్రెడ్డి వల్లెవేస్తున్నారని అన్నారు. తెలంగాణ రాష్ర్టానికి కేంద్ర ప్రభుత్వం ఎన్డీఆర్ఎఫ్ ద్వారా ఇచ్చిన అదనపు నిధులపై కిషన్రెడ్డి మాట్లాడాలని డిమాండ్ చేశారు. లోక్సభలో ఈనెల 19న కేంద్ర హోంశాఖ సహాయమంత్రి నిత్యానందరాయ్ చేసిన ప్రకటనను ఒకసారి చదవాలని కిషన్రెడ్డికి మంత్రి కేటీఆర్ హితవు పలికారు.
రాజ్యాంగంలోని ఆర్టికల్ 280 ప్రకారం ఆర్థికసంఘం ద్వారా రాష్ర్టాలకు ఎస్డీఆర్ఎఫ్ నిధులను కేటాయించాల్సిన బాధ్యత కేంద్రంపై ఉంటుందని గుర్తుచేశారు. ఇదే ప్రకటనలో 2018 నుంచి ఇప్పటివరకు తెలంగాణకు ఎన్డీఆర్ఎఫ్ ద్వారా అదనంగా ఒక రూపాయి ఇయ్యలేదని కేంద్రమంత్రి ప్రకటించిన మాట వాస్తవం కాదా? అని నిలదీశారు. స్వయంగా తన సహచర మంత్రి పార్లమెంట్ సాక్షిగా చేసిన ప్రకటన అవాస్తవమా? లేక కిషన్రెడ్డి తెలంగాణ ప్రజలను తన అబద్ధాలతో మోసం చేస్తున్నారో తేల్చి చెప్పాలన్నారు. కేంద్ర హోంమంత్రి అమిత్షా చైర్మన్గా ఉన్న హైలెవెల్ కమిటీ ఇచ్చే ఎన్డీఆర్ఎఫ్ నిధులు అడిగే ధైర్యంలేక కిషన్రెడ్డి అబద్ధాలు చెప్తున్నారని కేటీఆర్ మండిపడ్డారు. సొంత రాష్ట్ర ప్రజలను తప్పుదోవ పట్టిస్తూ, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంపై అభాండాలు వేసిన కిషన్రెడ్డి వెంటనే క్షమాపణ చెప్పాలని మంత్రి కేటీఆర్ డిమాండ్ చేశారు.
ఏమార్చేందుకే కేంద్ర బృందాలు
హైదరాబాద్ నగరం చరిత్రలో ఎన్నడూ లేని వర్షాలతో మునిగి కష్టాలు పడ్డప్పుడు రాష్ట్ర ప్రభుత్వం అడిగిన సుమారు రూ.3500 కోట్ల ప్రత్యేక సహాయంలో ఒక రూపాయి కూడా కేంద్రం నుంచి రాలేదని మంత్రి కేటీఆర్ స్పష్టం చేశారు. తాజాగా కురిసిన భారీ వర్షాల వలన జరిగిన ప్రాథమిక నష్టం రూ.1,400 కోట్లని తేల్చి, ఈ మేరకు కేంద్రం రాష్ట్ర ప్రజలకు ప్రత్యేక ఎన్డీఆర్ఎఫ్ నిధులు అందించాలని కోరితే కేవలం బృందాలను పంపించి చేతులు దులుపుకొనే ప్రయత్నం చేస్తున్నదని అన్నారు. హైదరాబాద్ వరదల అనంతరం కేంద్ర ప్రభుత్వం పంపిన బృందం రూపొందించిన నివేదిక ఏమైందో ప్రజలకు వివరించాలని, ప్రత్యేక సహాయం కేంద్రం ఎందుకు ఇవ్వలేదో ప్రజలకు చెప్పాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో పర్యటించిన కేంద్ర బృందాలతో రాష్ర్టానికి ఒరిగింది ఏమీలేదని, కేవలం తెలంగాణ ప్రజలను ఏమార్చేందుకే కేంద్రం బృందాలను పంపుతున్నదని పేర్కొన్నారు.
మీకు నిధులు..మాకు బృందాలా?
బీజేపీ పాలిత రాష్ర్టాలతోపాటు తౌక్టే తుఫాన్ వల్ల గుజరాత్లో వరదలు వచ్చినప్పుడు స్వయంగా ఆగమేఘాల మీద సర్వే జరిపించి 2021లో రూ.1000 కోట్ల ఎన్డీఆర్ఎఫ్ ప్రత్యేక అదనపు సహాయాన్ని అడ్వాన్స్ రూపంలో విడుదల చేసిన ప్రధాని మోదీకి, తెలంగాణ ప్రజల కష్టాలు కనిపించడం లేదని.. ఈ విషయంలో ప్రధాని వివక్షపూరిత వైఖరిని ఎండగట్టడం కొనసాగిస్తామని స్పష్టంచేశారు. వేరే పార్టీలు అధికారంలో ఉన్న రాష్ర్టాలకు బృందాలను పంపి.. బీజేపీ అధికారంలో ఉన్న రాష్ర్టాలకు మాత్రం నిధుల మూటలు పంపుతున్న వివక్షపూరిత బీజేపీ ప్రభుత్వం ఢిల్లీలో ఉన్నదని అన్నారు. తాము అధికారంలో ఉన్న 4 రాష్ర్టాలకు 2018 నుంచి ఇప్పటిదాకా రూ.15,270 కోట్లు ఇచ్చిన కేంద్రానికి, తెలంగాణకు నిధులు ఇచ్చేందుకు ఎందుకు చేతులు రావడం లేదని ప్రశ్నించారు. 2018 నుంచి ఇప్పటిదాకా బీజేపీ సంకీర్ణ ప్రభుత్వమున్న బీహార్కు సుమారు రూ.3,250 కోట్లు, బీజేపీ ప్రభుత్వాలున్న మధ్యప్రదేశ్కు రూ.4,530 కోట్లు, కర్ణాటకకు రూ.6,490 కోట్లు, గుజరాత్కు రూ.1000 కోట్ల ఎన్డీఆర్ఎఫ్ అదనపు నిధులు అందించిన విషయం వాస్తవం కాదా? అని కేటీఆర్ ప్రశ్నించారు. ఆయా రాష్ర్టాల మాదిరే తెలంగాణ రాష్ర్టానికి ఎన్డీఆర్ఎఫ్ ద్వారా అందించిన అదనపు నిధులు ఎన్నో దమ్ముంటే కిషన్రెడ్డి ప్రకటించాలని కేటీఆర్ డిమాండ్ చేశారు. రాష్ట్రం నుంచి ప్రాతినిధ్యం వహిస్తూ రాష్ట్ర ప్రజల ప్రయోజనాలకు విరుద్ధంగా అబద్ధాలు చెప్తున్న కిషన్రెడ్డి రాష్ట్ర ప్రజలకు క్షమాపణ చెప్పాలని అన్నారు. ఇప్పటికైనా సొంత రాష్ట్రంపై కొంతైనా ప్రేమ ఉంటే కేంద్ర ప్రభుత్వం వద్ద తెలంగాణ కోసం ప్రత్యేకంగా ఎన్డీఆర్ఎఫ్ ద్వారా అదనపు నిధుల కోసం ప్రయత్నం చేయాలని సూచించారు. లేదంటే 2018 నుంచి ఇప్పటిదాకా ఒక్కపైసా అదనంగా అందించని తమ కేంద్ర ప్రభుత్వానిది వివక్షపూరిత వైఖరేనన్న నిజాన్ని ఒప్పుకోవాలని కేటీఆర్ తేల్చిచెప్పారు. లేకుంటే కేంద్రమంత్రిగా ఉంటూ సొంత రాష్ర్టానికి నయాపైసా సాయం తీసుకొనిరాని చేతకాని మంత్రిగా కిషన్రెడ్డి చరిత్రలో మిగిలిపోతారని చెప్పారు.
ఏమార్చేందుకే కేంద్ర బృందాలు
హైదరాబాద్ నగరం చరిత్రలో ఎన్నడూ లేని వర్షాలతో మునిగి కష్టాలు పడ్డప్పుడు రాష్ట్ర ప్రభుత్వం అడిగిన సుమారు రూ.3500 కోట్ల ప్రత్యేక సహాయంలో ఒక రూపాయి కూడా కేంద్రం నుంచి రాలేదని మంత్రి కేటీఆర్ స్పష్టం చేశారు. తాజాగా కురిసిన భారీ వర్షాల వలన జరిగిన ప్రాథమిక నష్టం రూ.1,400 కోట్లని తేల్చి, ఈ మేరకు కేంద్రం రాష్ట్ర ప్రజలకు ప్రత్యేక ఎన్డీఆర్ఎఫ్ నిధులు అందించాలని కోరితే కేవలం బృందాలను పంపించి చేతులు దులుపుకొనే ప్రయత్నం చేస్తున్నదని అన్నారు. హైదరాబాద్ వరదల అనంతరం కేంద్ర ప్రభుత్వం పంపిన బృందం రూపొందించిన నివేదిక ఏమైందో ప్రజలకు వివరించాలని, ప్రత్యేక సహాయం కేంద్రం ఎందుకు ఇవ్వలేదో ప్రజలకు చెప్పాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో పర్యటించిన కేంద్ర బృందాలతో రాష్ర్టానికి ఒరిగింది ఏమీలేదని, కేవలం తెలంగాణ ప్రజలను ఏమార్చేందుకే కేంద్రం బృందాలను పంపుతున్నదని పేర్కొన్నారు.