ఖానాపూర్: మద్యం మత్తులో బీజేపీ (BJP) నేతలు రెచ్చిపోయారు. బీఆర్ఎస్ (BRS) ఎమ్మెల్యే అభ్యర్థిపై దాడికి తెగబడిన ఘటన నిర్మల్ జిల్లాలో జరిగింది. బీఆర్ఎస్ నుంచి ఖానాపూర్ (Khanapur) ఎమ్మెల్యే అభ్యర్థిగా ఉన్న భూక్యా జాన్సన్ నాయక్ (Bhukya Johnson Naik) శుక్రవారం రాత్రి రజూరా గ్రామంలో పర్యటించారు. అదే సమయంలో బీజేపీ మాజీ ఎంపీపీ భర్త గడ్డం రవీందర్ తన అనుచరులతో కలిసి అటుగా వచ్చారు. మద్యం మత్తులో ఉన్న రవీందర్, ఆయన అనుచరులు.. జాన్సన్ నాయక్ కారును ఢీకొట్టారు. అంతేకాకుండా జాన్సన్ మీద దాడికి ప్రయత్నించారు. ఈ క్రమంలో ఇరువర్గాల మధ్య వాగ్వాదం జరిగింది.
బీఆర్ఎస్ నాయకులు సమాచారంతో పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. మద్యం మత్తులో దాడిచేసిన బీజేపీ నాయకులను అదుపులోకి తీసుకొని పోలీస్ స్టేషన్కు తరలించారు. విషయం తెలుసుకున్న బీజేపీ నేత, మాజీ ఎంపీ రాథోడ్ రమేష్ (Ramesh Rathod) తన అనుచరులతో కలిసి పోలీస్ స్టేషన్కు చేరుకొని వీరంగం సృష్టించారు. పోలీసులపై దాడి చేసేలా కార్యకర్తలను రెచ్చగొట్టారు. అంతేకాకుండా.. స్టేషన్లోని కిటికీలు, తలుపులను విరగ్గకొట్టి హంగామా చేశారు.