సుల్తాన్బజార్/హైదరాబాద్, జనవరి 21 (నమస్తే తెలంగాణ): ఢిల్లీ నుంచి గల్లీ దాకా బీజేపీ లీడర్లు అబద్ధాలు మాత్రమే ప్రచారం చేస్తుంటారని టీఎస్ఎంఐడీసీ చైర్మన్ ఎర్రోళ్ల శ్రీనివాస్ అన్నారు. జెమ్ టెండర్లకు వైద్యారోగ్యశాఖకు, మంత్రి హరీశ్రావుకు ఎలాంటి సబంధం లేదని స్పష్టంచేశారు. రెండు ఏజెన్సీల పంచాయితీని రాష్ట్ర ఆరోగ్యశాఖకు అంటకట్టడం ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్ అవగాహనారాహిత్యానికి నిదర్శనమని తెలిపారు. హైదరాబాద్లో శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఎన్వీఎస్ఎస్ మాటలు అవాస్తమని, వాటిని ఖండిస్తున్నామని అన్నారు. అబద్ధాలాడటంలో ఆయనను మించినవారు లేరని వ్యాఖ్యానించారు. ఎన్వీఎస్ఎస్ వ్యాఖ్యలు జోక్ ఆఫ్ ద ఇయర్గా నిలిచిపోతాయని ఎద్దేవా చేశారు. కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాలకు అనుగుణంగా జెమ్ టెండర్లు వేసినట్టు చెప్పారు. రెండు ఏజెన్సీల పంచాయితీని రాష్ట్ర ప్రభుత్వానికి అంటకట్టాలని చూస్తే ఊరుకోబోమని తేల్చిచెప్పారు. ప్రస్తుతం టెండర్ల విషయం కోర్టులో ఉన్నదని, కోర్టు ఆదేశాల మేరకే తాము పని చేస్తామని స్పష్టం చేశారు. ‘అక్రమాలకు, అవినీతిపరులకు కేరాఫ్ అడ్రస్ మీ బీజేపీ పార్టీ, మీ నాయకులు. దమ్ముంటే నీ ఆరోపణలను రుజువు చెయ్యు. లేదంటే ముక్కు నేలకు రాయాలి’ అని సవాల్ విసిరారు.