వికారాబాద్, మార్చి 22: వికారాబాద్ జిల్లాకు చెందిన బీజేపీ నేత, రిటైర్డ్ ఏఎస్పీ సాయికృష్ణ ఓ యువతిని లైంగికం గా వేధించాడు. దీం తో ఆ యువతి తనకు రక్షణ కల్పించాలని పోలీసులకు ఫిర్యాదు చేసింది. బాధితురాలు తెలిపిన వివరాల ప్రకారం.. వికారాబాద్ పట్టణానికి చెందిన ఓ యువతి తల్లి పార్వతమ్మకు.. తల్లిదండ్రుల పేరుతో ఉన్న 7 ఎకరాల భూమి విషయంలో సోదరుడితో గొడవలు తలెత్తాయి. ఈ విషయమై పార్వతమ్మ కోర్టు లో కేసు వేసింది. ఈ కేసును న్యాయవాది, బీజేపీ నేత సాయికృష్ణకు అప్పగించారు. పార్వతమ్మకు ముగ్గురు కూతుళ్లు ఉన్నారు. కేసు విషయం పక్కన పెట్టి సాయికృష్ణ ఆమె కూతురుకు ఫోన్ చేసి లైంగింకంగా వేధించేవాడు. ఈ నెల 12న రాత్రి 11 గంటల ప్రాంతంలో సాయికృష్ణ యువతి ఇంటికి వచ్చి అసభ్యంగా ప్రవర్తించాడు. యువతి భర్త తలపై తుపాకీ పెట్టి చంపుతానని బెదిరించాడు. మరుసటి రోజు భర్తతో కలిసి ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు కేసు నమోదు చేయక పోవడంతో ఎన్సీఆర్లో పెట్టినట్టు యువ తి ఫోన్కు మెసేజ్ వచ్చింది. పోలీసులను వివరణ కోరగా సాయికృష్ణపై కేసు నమో దు చేసి దర్యాప్తు చేపట్టినట్టు తెలిపారు.