ముఖ్యమంత్రి కేసీఆర్ సంతాపం
వరంగల్, ఫిబ్రవరి 5: బీజేపీ కురువృద్ధుడు, మాజీ ఎంపీ చందుపట్ల జంగారెడ్డి (87) మృతిచెందారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న జంగారెడ్డి శనివారం హైదరాబాద్లోని ఓ దవాఖానలో తుదిశ్వాస విడిచారు. ఆయనకు ఒక కొడుకు, కూతురు ఉన్నారు. జంగారెడ్డి మృతిపట్ల ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు సం తాపం ప్రకటించారు. జంగారెడ్డి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. 18 నవంబర్ 1935లో పరకాలలో జన్మించిన జంగారెడ్డి కొంతకాలం ఉపాధ్యాయ వృత్తిలో కొనసాగారు. అనంతరం ఉద్యోగానికి రాజీనామా చేసి రాజకీయాల్లో వచ్చారు. 1967ఎన్నికల్లో భారతీయ జనసంఘ్ తరఫున పరకాల నుంచి ఎమ్మెల్యేగా విజయం సాధించారు. 1978, 1983లో జనతాపార్టీ తరఫున శాయంపేట నుంచి విజయం సాధించారు. 1984లో హనుమకొండ పార్లమెంట్ నియోజకవర్గం నుంచి బీజేపీ అభ్యర్థిగా పీవీ నరసింహారావుపై భారీ మెజారీటీతో విజయం సాధించి చరిత్ర సృష్టించారు. మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు, రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బీ వినోద్కుమార్, ఎమ్మెల్సీలు పల్లా రాజేశ్వర్రెడ్డి, తక్కళ్లపల్లి రవీందర్రావు తదితరులు జంగారెడ్డి పార్థీవదేహానికి నివాళులు అర్పించారు.