Sircilla | సిరిసిల్లలో బీజేపీకి షాక్ తగిలింది. బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు, సిరిసిల్లకు చెందిన ప్రముఖ న్యాయవాది ఆవునూరి రమాకాంత్రావు బీజేపీకి రాజీనామా చేశారు. తన అనుచరులతో కలిసి హైదరాబాద్లోని ప్రగతి భవన్లో మంత్రులు కేటీఆర్, హరీశ్రావు సమక్షంలో బీఆర్ఎస్లో చేరారు. ఈ సందర్భంగా ఆవునూరి రమాకాంత్రావు మాట్లాడుతూ.. సిరిసిల్లలో మంత్రి కేటీఆర్ గెలుపు కోసం కృషి చేస్తానని తెలిపారు.
అంతకుముందు సిరిసిల్ల ప్రెస్క్లబ్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడిన ఆవునూరి రమాకాంత్రావు.. బీజేపీపై ఫైర్ అయ్యారు. బీజేపీలో పైకి కనబడేది సిద్దాంతం.. లోపల అన్నీ గ్రూపు రాజకీయాలే అని విమర్శించారు. బండి సంజయ్ నాయకత్వాన్ని నమ్ముకుని బీజేపీలో చేరామని.. కానీ మాకు అన్యాయం జరిగితే ఆయన నోరు మెదపలేదని ఆవేదన వ్యక్తం చేశారు. స్థానిక నాయకులతో చర్చించకుండా నర్సంపేటకు చెందిన రాణి రుద్రమకు సిరిసిల్ల టికెట్ ఇవ్వడమేంటని ప్రశ్నించారు. పార్టీ తీసుకున్న నిర్ణయంపై మనస్తాపంతో బీజేపీకి రాజీనామా చేస్తున్నానని ప్రకటించారు.