మునుగోడు, అక్టోబర్ 29: బీజేపీ మరో కుట్రకు తెరలేపింది. మునుగోడు ఉప ఎన్నికలో కారు గుర్తుకు కచ్చితంగా ఓటేసే వృద్ధులను ఎంపిక చేసి.. వారు ఓట్లు వేయకుండా నివారించేందుకు బీజేపీ గోరింటాకు వ్యూహాన్ని రచించింది. ఈటల జమున సన్నిహితురాలైన మెదక్ జిల్లాకు చెందిన పోచమ్మ అశ్విని అనే యువతి సంస్థాన్ నారాయణపురం మండలం పలివెల గ్రామంలో వృద్ధురాలి చేతిపై గోరింటాకుతో బీజేపీ ఎన్నికల గుర్తు అయిన కమలం పువ్వును వేసింది.
పోలింగ్ సెంటర్లో ఎన్నికల గుర్తులను బహిరంగంగా ప్రదర్శించే వారు ఓటు వేయడానికి అనర్హులు. దీన్ని సాకుగా చూపి పోలింగ్ కేంద్రాలకు వృద్ధులు వెళ్లకుండా నిలువరించడానికి బీజేపీ ఈ రకం ఎత్తుగడ వేసింది. పలివెలలో ఓ వృద్ధురాలికి గోరింటాకుతో కమలం పువ్వు గుర్తు వేస్తున్న ఫొటో సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నది. ఈ విషయం తెలియని వృద్ధులు గోరింటాకే కదా అని వేసుకుంటున్నారు.