మహబూబాబాద్ : రాజకీయ లబ్ధికోసం బీజేపీ నాయకులు విద్యార్థుల జీవితాలతో చెలగాటమాడుతున్నారని మహబూబాబాద్ ఎమ్మెల్యే బానోత్ శంకర్ నాయక్(Mla Shanker Naik) ఆరోపించారు. ఈ కుట్రలో నూటికి నూరు శాతం కుట్ర దారి బండినేనని విమర్శించారు. బుధవారం జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడారు. రాష్ట్రానికి పార్టీ అధ్యక్షుడిగా ఉన్న నీచ రాజకీయాలకు ఒడిగడుతున్నారని అన్నారు.
పేపర్ లీక్ చేసింది మాజీ టీబీ జర్నలిస్ట్ ప్రశాంత్ బండి సంజయ్కు అనుచరుడని పేర్కొన్నారు. సీఎం కేసీఆర్(CMKCR)ను ఎదుర్కొనలేక తప్పుడు విధానాలతో ప్రభుత్వంపై ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. తెలంగాణలో మత చిచ్చు ప్రయత్నాలు ఫలించకపోవడంతో లక్షలాది మంది తెలంగాణ బిడ్డల భవిష్యత్తో ఆడుకుంటుందని ఆరోపించారు.
బుద్ధి మార్చుకోకపోతే బీజేపీ(BJP)ని ప్రజలు తరిమికొట్టే రోజులు దగ్గర పడ్డాయని వెల్లడించారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ డాక్టర్ రామ్మోహన్ రెడ్డి, వైస్ చైర్మన్ ఎండి ఫరీద్, జడ్పీటీసీ శ్రీనివాస్ రెడ్డి, రాష్ట్ర నాయకులు మర్నేని వెంకన్న, పట్టణ అధ్యక్ష, కార్యదర్శులు గద్దె రవి, గోగుల రాజు, యువ నాయకులు యళ్ల మురళీధర్ రెడ్డి, పట్టణ ప్రజాప్రతినిధులు, బీఆర్ఎస్ ముఖ్యనాయకులు, తదితరులు పాల్గొన్నారు.