హైదరాబాద్, మే 28 (నమస్తే తెలంగాణ): బీజేపీ ప్రభుత్వం ఎస్సీ, ఎస్టీలకు వ్యతిరేకమని స్పష్టమైందని టీఎస్ఎంఎస్ఐడీసీ చైర్మన్ ఎర్రోళ్ల శ్రీనివాస్ పేర్కొన్నారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. కొత్త పార్లమెం ట్ భవనానికి డాక్టర్ బీఆర్ అంబేదర్ పేరు పెట్టాలని దేశవ్యాప్తంగా డిమాండ్ వచ్చినా మోదీ సర్కారు లెక్కచేయలేదని, అంబేదర్ దళిత బిడ్డ కాబట్టే పట్టించుకోలేదని విమర్శించారు.
మరోవైపు గిరిజన బిడ్డ అయిన రాష్ట్రపతి ద్రౌపది ముర్మును పార్లమెంట్ భవన ప్రారంభోత్సవానికి ఆహ్వానించలేదని, దీన్ని బట్టి మోదీ ప్రభుత్వం దళిత, గిరిజన, బహుజన వర్గాలకు వ్యతిరేకమని తేలిపోయిందని పేర్కొన్నారు. బండి సంజయ్ దళితుల గురించి మాట్లాడేటప్పుడు ఒళ్లు దగ్గర పెట్టుకోవాలని సూచించారు. రాజ్యాంగాన్ని అడుగడుగునా అవమానిస్తున్న బీజేపీకి రానున్న రోజుల్లో ప్రజలే బుద్ధి చెప్తారని శ్రీనివాస్ పేర్కొన్నారు.