ప్రణాళికాసంఘం ఉపాధ్యక్షుడు వినోద్
ఇల్లంతకుంట, ఫిబ్రవరి 14: బీజేపీ నాయకులు ద్వంద్వ వైఖ రితో సీఎం కేసీఆర్పై నిరాధార ఆరోపణలు చేస్తున్నారని ప్రణాళి కాసంఘం ఉపాధ్యక్షుడు బీ వినో ద్కుమార్ మండిపడ్డారు. రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండలం వెల్జీపూర్లో ఎమ్మెల్యే రసమయి బాలకిషన్తో కలిసి మీడియాతో మాట్లాడారు. వరి సాగు వద్దని, రైతులు పంటమార్పిడి విధానంవైపు అడుగులువేసేలా చూడాలని కేంద్రమం త్రులే సూచించారని చెప్పారు. ఇప్పుడు బీజేపీ నాయకులే కేసీఆర్పై విమర్శలు చేయడం విడ్డూరంగా ఉంద న్నారు. భారత్ బయోటెక్కు సీఎం రాకుండానే ప్రధాని వస్తాననడం, ముచ్చింతల్కు ప్రధాని వచ్చినా సీఎం రాలేదని విమర్శించడం ఏమిటని ప్రశ్నించారు. రాష్ట్రం లో ప్రతిపక్షం కాంగ్రెస్ పార్టీ మాత్రమేనని అన్నారు.