జహీరాబాద్, ఫి బ్రవరి 28: రాహు ల్ గాంధీ ముఠా తె లంగాణను దోపిడీ చేస్తున్నదని కేంద్ర మంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు జీ కిషన్రెడ్డి విమర్శించారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి 80 రోజులైనా అభివృద్ధి, సంక్షేమాన్ని పట్టించుకోవడం లేదని అన్నారు.
విజయ సంకల్ప యాత్రలో భాగంగా బుధవారం సంగారెడ్డి జిల్లా జహీరాబాద్లో ఏర్పాటు చేసిన సభలో ఆయన మాట్లాడారు. తెలంగాణలో దోపిడీ చేసిన డబ్బులు దేశంలోని పార్లమెంట్ ఎన్నికల్లో ఖర్చు చేసేందుకు ప్రయత్నిస్తున్నదని ఆరోపించారు. పార్లమెంట్ ఎన్నికల్లో ఎంఐఎం హైదరాబాద్లో ఓడిపోవడం ఖాయమని కిషన్రెడ్డి జోస్యం చెప్పారు.