హైదరాబాద్, సెప్టెంబర్ 28 (నమస్తే తెలంగాణ) : బీజేపీ ముక్త్ భారత్ కేసీఆర్తోనే సాధ్యమని చెక్ రిపబ్లిక్లోని ప్రవాస భారతీయులు అభిప్రాయపడ్డారు. దేశవ్యాప్తంగా తెలంగాణ ముద్ర అనివార్యమని పేర్కొన్నారు. కేసీఆర్ జాతీయ రాజకీయాల్లోకి రావాలని, ఆయన నాయకత్వంలో దేశంలో రైతు రాజ్యస్థాపన జరగాలని అభిలషించారు.
దేశంలో రైతు రాజ్యం రావాలె
తెలంగాణలో రైతులకు ఉచిత విద్యుత్తు ఇస్తున్నట్టే దేశంలోని రైతులందరికీ ఇవ్వాలి. వ్యవసాయ ఆధారిత దేశమైన భారత్లో రైతాంగానికి ఉచిత విద్యుత్తు, రైతుబంధు, రైతుబీమా వంటి పథకాలన్నీ అమలు చేయాలి. 75 ఏండ్లుగా కేంద్రంలో పాలించిన పార్టీలు, నేతలు దేశాన్ని తీవ్ర నిర్లక్ష్యానికి గురిచేశారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వ దమననీతిని, ద్వంద్వ విధానాలను ఎండగట్టే దీటైన నాయకుడు సీఎం కేసీఆర్ మాత్రమే. కేసీఆర్ జాతీయ రాజకీయాల్లోకి వస్తే దేశమంతా ఆయన వెంట నిలబడుతుంది.
–బీరేంద్రకుమార్, సాఫ్ట్వేర్ ఇంజినీర్, ప్రాగ్, చెక్రిపబ్లిక్
దేశంలో రాజకీయ శూన్యత
వర్తమాన జాతీయ రాజకీయా లు, దేశ పాలనలో శూన్యత ఏర్పడింది. దీన్ని భర్తీ చేయగల నాయకుడిగా దేశంలో సీఎం కేసీఆర్ ఒక్కరే కనిపిస్తున్నారు. ఈ దేశం కేసీఆర్ సేవల కోసం ఎదురుచూస్తున్నది. అందరినీ కలుపుకొని ప్రజాస్వామ్యబద్ధం గా, శాంతిపంథాలో తెలంగాణ కోసం ఉ ద్యమించి స్వరాష్ర్టాన్ని సాధించిన కేసీఆర్ అనుభవం దేశ రాజకీయాలకు అవసరం. – రాఘవరెడ్డి లోకసాని, చెక్రిపబ్లిక్
బీజేపీ ముక్త్ భారత్ కోసం సమష్టి కృషి అవసరం
దేశంలో విచ్ఛిన్నకర ధోరణులు ప్రబలుతున్నాయి. ప్రజల మధ్య వైషమ్యాలు పెంచే పాలకులను సాగనంపాలి. ఆ శక్తి కేసీఆర్కే ఉన్నది. కేంద్రంలోని బీజేపీ పాలకులు ప్రజల మధ్య చిచ్చుపెడుతుంటే కేసీఆర్ మాత్రం ప్రజల ఐక్యత కోసం అనేక కార్యక్రమాలు అమలు చేస్తున్నారు. బీజేపీకి ప్రత్యామ్నాయం కోసం ప్రజలు ఎదురుచూస్తున్నారు. ఆ ప్రత్యామ్నాయ శక్తి కేసీఆరే.
–ప్రేమ్ నందివాడ, సాఫ్ట్వేర్ ఇంజినీర్, ప్రాగ్, చెక్ రిపబ్లిక్