BJP | దుబ్బాక టౌన్, అక్టోబర్ 1: సిద్దిపేట జిల్లా దుబ్బాక నియోజకవర్గంలో బీజేపీ దొడ్డి దారిన గెలువాలని ఎన్నికలకు ముందే ప్రజలను ప్రలోభాలకు గురిచేయడం ప్రారంభించింది. ఈ విషయమై కొన్ని దృశ్యాలు ఆదివారం సోషల్మీడియాలో హల్చల్ చేశాయి. ఎమ్మెల్యే రఘునందన్రావు ఫొటోలు ఉన్న గొడుగులు, చీరలు, జ్యూట్బ్యాగులను బీజేపీ శ్రేణులు బహిరంగంగా గ్రామాల్లోకి ఆటోలో తీసుకొచ్చి పంపిణీ చేశాయి.
బీజేపీ శ్రేణులు అందిస్తున్న జ్యూట్ బ్యాగుల్లో చీరలు, గొడుగులు ఉన్నాయా? మరేమైనా డబ్బులు ఉన్నాయా? అంటూ కామెంట్స్ వస్తున్నాయని, వీటిపై ఎమ్మెల్యే రఘునందన్రావు సమాధానం చెప్పాలని బీఆర్ఎస్ శ్రేణులు సోషల్మీడియా వేదికగా డిమాండ్ చేశాయి. ప్రజలకు ఇచ్చిన మాటను నిలబెట్టుకోక.. ఎన్నికల్లో గెలిచే అవకాశం లేదని గ్రహించి ఎమ్మెల్యే ఎన్నికల ప్రలోభాలకు తెరలేపారని విమర్శిస్తున్నాయి. ఈ విషయమై ఎమ్మెల్యే రఘునందన్రావుపై ఎన్నికల కమిషన్ చర్యలు తీసుకోవాలని బీఆర్ఎస్ శ్రేణులు కోరుతున్నాయి.