తిరుమలగిరి, నవంబర్ 18: తెలంగాణ తరహా పథకాళ కోసం దేశ ప్రజల నుంచి వస్తున్న డిమాండ్లతోనే సీఎం కేసీఆర్పై కేంద్రం కక్ష సాధింపు చర్యలకు దిగుతున్నదని విద్యుత్తు శాఖ మంత్రి జగదీశ్రెడ్డి అన్నారు. దాన్ని జీర్ణించుకోలేని బీజేపీ నేతలు రాష్ట్రం లో అభివృద్ధిని అడ్దుకునే కు్రట్ర చేస్తున్నారని ఆరో పించారు. శుక్రవారం సూర్యాపేట జిల్లా తిరుమలగిరి మున్సిపాలిటీ వ్యవసాయ మార్కెట్ నూతన పాలక వర్గ ప్రమాణ స్వీకారోత్సవంలో ఆయన పాల్గొన్నారు. సూర్యాపేటలో పత్తి కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభిం చారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. నేతలను జోడించలేని రాహుల్ గాంధీ.. భారత్ జోడో యాత్ర చేయడం హాస్యాస్పదంగా ఉన్నదని ఎద్దేవా చేశారు.
దేశానికి, ముఖ్యంగా తెలంగాణకు బీజేపీ రూపంలో ప్రమాదం పొంచి ఉన్నదని పేర్కొన్నారు. 2014 వరకు తెలంగాణ సమాజం పడిన బాధలకు పరిష్కారంగా అభివృద్ధి అంటే ఇలా ఉంటుందా? అనేలా సీఎం కేసీఆర్ రాష్ర్టాన్ని అన్ని రంగాల్లో ముందు వరుసలో నిలిపారని చెప్పారు. దేశానికే దిక్సూచిగా రాష్ట్రం మారిందన్నారు. 24 గంటల విద్యుత్తు, సాగునీరు దేశవ్యాప్తంగా ఇవ్వడానికి సరిపడా వనరులు ఉన్నాయని స్పష్టం చేశారు. సీఎం కేసీఆర్కు దేశవ్యాప్తంగా వస్తున్న ఆదరణను చూసి తట్టుకోలేని బీజేపీ నేతలు తెలంగాణపై కుట్రలకు పాల్పడుతున్నారని దుయ్యబట్టారు. అధికారంలోకి వస్తే ఏడాదికి రెండు కోట్ల ఉద్యోగాలిస్తామని చెప్పి ఇవ్వకపోగా, లక్షలాది ఉద్యోగాలు తీసేసి నిరుద్యోగ యువతను మోదీ ప్రభుత్వం మోసం చేసిందని మండిపడ్డారు. కేసీఆర్ నాయత్వాన్ని దేశప్రజలు కోరుకుంటున్నారని, అందుకోసం యావత్ భారతావని ఎదరుచూస్తున్నదని తెలిపారు. కార్యక్రమంలో ఎంపీ బడుగుల లింగయ్య యాదవ్, ఎమ్మెల్యే గాదరి కిశోర్కుమార్ తదితరులు పాల్గొన్నారు.