హైదరాబాద్ : రాష్ట్రంలో సీఎం కేసీఆర్ చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలకు ఆకర్షితులై ఇతర పార్టీలకు చెందిన నాయకులు టీఆర్ఎస్లో చేరుతున్నారని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత తెలిపారు. ఆదివారం నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే గణేష్ బిగాల ఆధ్వర్యంలో నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్కు చెందిన బీజేపీ పార్టీ 39 వ డివిజన్ కార్పొరేటర్ నిచ్చెంగు లత, 44 వ డివిజన్ కార్పొరేటర్ బైకాన్ సుధ ఎమ్మెల్సీ కవిత సమక్షంలో టీఆర్ఎస్ పార్టీ లో చేరారు.
వారికి ఎమ్మెల్సీ కవిత గులాబీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ మాట్లాడుతూ..టీఆర్ఎస్లోనే కార్యకర్తలకు సరైన గౌరవం లభిస్తుందన్నారు. పార్టీలో చేరిన ప్రతి కార్యకర్తను కంటికి రెప్పలా కాడుకుంటామన్నారు.