నిజామాబాద్ క్రైం, ఆగస్టు 27: నిజామాబాద్ నగరంలో బీజేపీ కార్పొరేటర్ సుక్కా మధు తన ఏరియాలో కొత్తగా ఇంటి నిర్మాణం చేస్తున్న ఓ వ్యక్తిని డబ్బు లు డిమాండ్ చేశారు. తాను అందరి మాదిరిగా కాదని, తనకు డబ్బులు ఇవ్వాల్సిందేనని సదరు కార్పొరేటర్ దర్జాగా డబ్బులు డిమాండ్ చేసిన ఫోన్ సంభాషణను.. ఆ ఇంటి యజమాని రికార్డు చేసి సోషల్ మీడియాలో పోస్టు చేయగా అది వైరల్గా మారింది. ఈ విషయం బీజేపీ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.