తెలంగాణచౌక్, సెప్టెంబర్ 14: దేశంలో విద్యావ్యవస్థను నిర్వీర్యం చే యాలని, విద్యార్థుల మ ధ్య మత విద్వేషాలు రెచ్చగొట్టాలని ఆరెస్సెస్, కేం ద్రంలోని బీజేపీ ప్రభు త్వం కుటిల ప్రయత్నాలు చేస్తున్నదని ఎస్ఎఫ్ఐ జాతీయ మాజీ అధ్యక్షుడు శివదాసన్, ఎమ్మెల్సీ నర్సిరెడ్డి మండిపడ్డారు. ఎస్ఎఫ్ఐ రాష్ట్ర 4వ మహాసభల సందర్భంగా కరీంనగర్లోని కళాశాల గ్రౌండ్లో బుధవారం నిర్వహించిన బహిరంగ సభలో వారు మాట్లాడారు.
ప్రధానిగా మోదీ ఫెయిలయ్యారని, ఆయన పాలనాపగ్గాలు చేపట్టిన నాటి నుంచి దేశ ప్రతిష్ట రోజురోజుకూ దిగజారిపోతున్నదని విమర్శించారు. కోటి ఉద్యోగాల హామీతో అధికారంలోకొచ్చిన బీజేపీ సర్కా రు ఒక్క ఉద్యోగమూ ఇవ్వకపోగా, ఉన్న కొలువులు తీసేస్తున్నారని దుయ్యబట్టారు. కేంద్రప్రభుత్వ ఆధ్వర్యంలో నడుస్తున్న ఐఐటీల పరిస్థితి దారుణంగా ఉన్నదని, విద్యార్థులకు మౌలిక వసతుల కల్పనలో విఫలమైందని విమర్శించారు. విద్యారంగానికి కేంద్ర బడ్జెట్లో పది శాతం నిధులను కేటాయించాలని డిమాండ్ చూశారు.