బడంగ్పేట, మే 1: బీఆర్ఎస్ అధినేత కేసీఆర్కు వస్తున్న ప్రజాస్పందన చూసి కాంగ్రెస్, బీజేపీ భయపడుతున్నాయని, అందుకే 48 గంటల పాటు ఆయన ప్రచారాన్ని ఆపించాయని చేవెళ్ల బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి కాసాని జ్ఞానేశ్వర్ ముదిరాజ్ అన్నారు. మీర్పేట మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని నందిహిల్స్లో నిర్వహించిన సమావేశానికి మాజీమంత్రి సబితాఇంద్రారెడ్డితో కలిసి హాజరయ్యారు. ప్రజలు మళ్లీ కేసీఆర్ పాలనే రావాలని కోరుకుంటున్నారని వెల్లడించారు.
నిషేధం అప్రజాస్వామికం: ఎర్రోళ్ల
బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఎన్నికల ప్రచారంపై నిషేధం విధించ టం అప్రజాస్వామ్యమని సీనియర్ నేత ఎర్రోళ్ల శ్రీనివాస్ అన్నారు. ప్రజల్లో వ స్తున్న స్పందన చూసి కాంగ్రెస్, బీజేపీకి వణుకు పుట్టిందని విమర్శించారు.