హైదరాబాద్, ఏప్రిల్ 28 (నమస్తే తెలంగాణ): కాంగ్రెస్ ఎమ్మెల్సీ, నిజామాబాద్ పార్లమెంట్ నియోజకవర్గ అభ్యర్థి జీవన్రెడ్డిపై కేంద్ర ఎన్నికల సంఘానికి బీజేపీ ఆదివారం ఫిర్యాదు చేసింది. కేంద్ర హోంమంత్రి అమిత్షా మార్ఫింగ్ వీడియోను జీవన్రెడ్డి ఎక్స్ ఖాతాలో పోస్ట్ చేశారని పేర్కొన్నది. అమిత్షా మాట్లాడిన వీడియోను ఎడిట్ చేసి ‘కేంద్రంలో బీజేపీ మరోసారి అధికారంలోకి వస్తే ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ రిజర్వేషన్లు ఎత్తేస్తాం’ అని అర్థం వచ్చేలా వీడియోను తయారుచేశారని తెలిపింది. సోషల్ మీడియాలో మార్ఫింగ్ వీడియోను వైరల్ చేస్తున్న జీవన్రెడ్డిపై చర్యలు తీసుకోవాలని కోరింది.