హైదరాబాద్: అసెంబ్లీ ఎన్నికల్లో ఎనిమిది స్థానాల్లో అనూహ్య విజయం సాధించిన బీజేపీ (BJP).. పార్లమెంటు ఎన్నికలకు సమాయత్తం అవుతున్నది. ఇన్నాళ్లు పట్టణాలు, నగరాలకే పరిమితమైన పార్టీ మరింత పుంజుకోవాలని చూస్తున్నది. ప్రస్తుతం ఉన్న స్థానాలతోపాటు మరిన్ని ఎంపీ సీట్లలో గెలుపొందాలని లక్ష్యంగా పెట్టుకున్నది. ఇందులో భాగంగా లోక్సభ నియోజకవర్గాలకు ఇన్చార్జిలను నియమించింది. 8 మంది ఎమ్మెల్యేలు, ఒక ఎమ్మెల్సీకి పార్టీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి బాధ్యతలు అప్పగించారు.