నాంపల్లి : మునుగోడు నియోజకవర్గంలోని నాంపల్లి మండలం ఉప్పరిగూడ, ముదిరాజ్ కాలనీకి చెందిన బీజేపీ, కాంగ్రెస్ నాయకులు టీఆర్ఎస్ పార్టీలో చేరారు. ఉప ఎన్నికల ప్రచారంలో భాగంగా గ్రామాలకు వెళ్లిన రాష్ట్ర పశుసంవర్ధక, మత్స్య, పాడి పరిశ్రమల అభివృద్ధి, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఎదుట కాంగ్రెస్కు చెందిన వార్డు సభ్యులు పెద్దిరెడ్డి రాజశేఖర్ రెడ్డి, నాంపల్లి పట్టణ బీజేపీ అధ్యక్షుడు కామిశెట్టి యాదయ్య ఆధ్వర్యంలో మరికొంత మంది ముఖ్యనాయకులు టీఆర్ఎస్లో చేరారు.
ఈ సందర్భంగా మంత్రి వారికి కండువాలను కప్పి టీఆర్ఎస్లోకి ఆహ్వానించారు. మంత్రి మాట్లాడుతూ నియోజకవర్గ అభివృద్ధి, ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలు పరిష్కారం కావాలంటే ఒక్క టీఆర్ఎస్తోనే సాధ్యమవుతుందని చెప్పారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ కృష్ణారెడ్డి, నాయకులు వెంకన్న గౌడ్, గుర్రం పవన్ కుమార్ గౌడ్, మునుగోడు నియోజకవర్గ పట్టణ అధ్యక్షుడు సత్తయ్య, రమేశ్, బెల్లి సత్తయ్య, కిరణ్, చంద్రమౌళి, శేఖర్, శివారెడ్డి, యాదయ్య, చరణ్, కొండయ్య, గణేష్ తదితరులు పాల్గొన్నారు.