నల్లగొండ : సీఎం కేసీఆర్ చేపడుతున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలకు ఆకర్షితులై వివిధ పార్టీలకు చెందిన బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు చెందిన నాయకులు, కార్యకర్తలు బీఆర్ఎస్ లో చేరుతున్నారని నకిరేకల్ ఎమ్మెల్యే(Nakirekal Mla) చిరుమర్తి లింగయ్య అన్నారు. శనివారం నకిరేకల్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో కేతపల్లి మండలం బొప్పారం గ్రామ సర్పంచ్ కర్ర ప్రభాకర్ రెడ్డి ఆధ్వర్యంలో వివిధ పార్టీల నుంచి 30 మంది నాయకులు బీఆర్ఎస్(BRS) లో చేరారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే వారికి గులాబీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ తెలంగాణ(Telangana) రాష్ట్రం ఏర్పాటు తరువాత అన్ని రంగాల్లో రాష్ట్రం అభివృద్ధి చెందిందని అన్నారు. బడుగు, బలహీన, మైనార్టీ వర్గాలకు సంక్షేమ పథకాలు అందుతున్నాయని పేర్కొన్నారు.
అభివృద్ధి(Development), సంక్షేమ కార్యక్రమాలు(Welfare Programms) సమపాళ్లలో అమలవుతున్నాయని వెల్లడించారు. మరోసారి బీఆర్ఎస్ అధికారంలోకి రావడం ఖాయమన్నారు పార్టీలో చేరిన వారిలో దుర్గం దుర్గయ్య, దుర్గం కృష్ణ, బట్ట సైదులు, దుర్గం అనంతమ్మ, బట్ట విజయ్, బట్ట మల్లమ్మ గొల్లం లింగమ్మ ఉన్నారు.