Minister KTR | హైదరాబాద్ : డబుల్ ఇంజిన్ రాష్ట్రాలుగా చెప్పుకునే బీజేపీ పాలిత రాష్ట్రాలు, దేశాన్ని అత్యధిక కాలం పాలించిన కాంగ్రెస్ పాలిత రాష్ట్రాలు, వారి మిత్ర పక్షాల పాలిత రాష్ట్రాలు తీవ్ర విద్యుత్ కొరతతో అస్తవ్యవస్త పాలనను కొనసాగిస్తున్నాయని మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు. అదే 2013-14లో విద్యుత్ లోటు రాష్ట్రంగా ఉన్న తెలంగాణ.. నేడు మిగులు విద్యుత్ రాష్ట్రంగా అవతరించడమే కాకుండా దేశంలోనే అత్యధిక తలసరి విద్యుత్ వినియోగంలో ప్రథమస్థానంలో నిలిచిందని అన్నారు. ఈ మేరకు మంత్రి కేటీఆర్ సోమవారం ట్వీట్ చేశారు.
రైతులకు నిరంతరం నాణ్యమైన విద్యుత్ను అందిస్తున్న ఏకైక రాష్ట్రం కూడా తెలంగాణ ఒక్కటేనని మంత్రి కేటీఆర్ ట్విట్టర్లో చెప్పారు. తెలంగాణ అభివృద్ధి నమూనా దేశానికే ఆదర్శమని పేర్కొన్నారు. కాంగ్రెస్, బీజేపీ పాలిత రాష్ట్రాల్లో విద్యుత్ సరఫరా, వినియోగం మధ్య ఉన్న వ్యత్యాసాలకు సంబంధించిన వివరాల జాబితాను పోస్టు చేశారు.

Energy Defict
In the below list the Majority of Energy deficit states are
1. Double Engine Sates (BJP governed)
2. Rest are Congress governed states or those of its Coalition partners
Telangana which was projected as a power deficit state in 2013-14 is now not only a power surplus state… pic.twitter.com/ilvfAAkiYr
— KTR (@KTRBRS) September 4, 2023