ఎస్సీ సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్
జమ్మికుంట, ఆగస్టు 13 : బీజేపీ దళిత వ్యతిరేకి అని ఎస్సీ సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ మండిపడ్డారు. దుర్మార్గమైన పార్టీకి ఇకడ స్థానం లేదని పేరొన్నారు. కరీంనగర్ జిల్లా జమ్మికుంట పట్టణంలోని 11, 27వ వార్డుల్లో రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్తో కలిసి శుక్రవారం మంత్రి పర్యటించారు. కాలనీకి చెందిన పలువురు టీఆర్ఎస్లో చేరగా, వారికి గులాబీ కండువా కప్పి సాదరంగా స్వాగతించారు. జమ్మికుంట మున్సిపల్ చైర్మన్ తక్కళ్లపల్లి రాజేశ్వర్రావు నివాసంలో మీడియాతో మాట్లాడారు. దళితులకు మేలు చేసేందుకు దళితబంధు పథకం సీఎం కేసీఆర్ ప్రవేశపెడితే బీజేపీ ఆ పథకంపై అసత్య ప్రచారం చేస్తున్నదని ఆగ్రహం వ్యక్తం చేశారు. దళితబంధును ఆపేందుకు కుట్రలు పన్నుతున్నారని ఆరోపించారు. ఈసీకి ఫిర్యాదు చేయడం, ధర్నాలు చేయండని రెచ్చగొట్టే ప్రయత్నాలు చేస్తున్నారని మండిపడ్డారు. ప్రజలు అప్రమత్తమై వాటన్నింటినీ విచ్ఛిన్నం చేయాలని, పనిచేసే ప్రభుత్వానికి పట్టం కట్టాలని విజ్ఞప్తి చేశారు. సమావేశంలో టీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు పాడి కౌశిక్రెడ్డి తదితరులు పాల్గొన్నారు.