హైదరాబాద్ : జనాభా ప్రాతిపదికన గిరిజన రిజర్వేషన్ బిల్లును తెలంగాణ అసెంబ్లీ తీర్మానం చేసి కేంద్ర ప్రభుత్వానికి పంపిన బిల్లు తమ వద్దకు చేరలేదని కేంద్ర గిరిజనశాఖ సహాయ మంత్రి చేసిన వ్యాఖ్యల పట్ల సూర్యాపేట గిరిజన లోకం భగ్గుమంటుంది.. కేంద్రం తీరు ను నిరసిస్తూ గిరిజనులు నాంపల్లిలోని భారతీయ జనతా పార్టీ ఆఫీసు ముట్టడికి యత్నించారు.
టీఆర్ఎస్ నాయకులు గెల్లు శ్రీనివాస్ యాదవ్ నేతృత్వంలో గిరిజనులు కాలినడకన బీజేపీ ఆఫీసు ముట్టడికి బయల్దేరారు. ఆఫీసు వద్ద గిరిజనులను పోలీసులు అడ్డుకుని అరెస్టు చేశారు. బీజేపీ ఆఫీసు ముందు ఆ పార్టీ యువ మోర్చా నాయకులు హంగామా చేశారు. కర్రలతో భయభ్రాంతులకు గురి చేశారు. గిరిజన నాయకులను, మహిళలను అసభ్య పదజాలంతో దూషించారు. గిరిజనులపై కర్రలతో దాడి చేసేందుకు యత్నించారు. పోలీసులు ఏర్పాటు చేసిన బారికేడ్లను బీజేపీ నాయకులు ఎక్కి హల్చల్ చేశారు.