హైదరాబాద్ సిటీబ్యూరో, నవంబర్ 27(నమస్తే తెలంగాణ): హైదరాబాద్ బిట్స్ పిలానిలో టెక్నికల్ ఫెస్ట్ ముగిసింది. మూడు రోజుల పాటు నిర్వహించిన ఈ కార్యక్రమానికి మీడియా పార్ట్నర్గా నమస్తే తెలంగాణ, తెలంగాణ టుడే వ్యవహరించాయి. ఆదివారం ముగింపు కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా బాలీవుడ్కు చెందిన అర్జున్ కనుంగో, ఆనంద్ భాస్కర్ హాజరయ్యారు. టెక్నికల్ ఫెస్ట్లో రాకెట్ సైన్స్, మషిన్ లెర్నింగ్, బిజినెస్ అనాలసిస్, రోబో వార్స్ ప్రదర్శనలు, ఇంటరాక్షన్ సెషన్స్, రేసింగ్ కార్స్ ప్రదర్శనలు నిర్వహించారు. విద్యార్థులు పలు సాంకేతిక అంశాలపై రూపొందించిన ప్రాజెక్టులను ప్రదర్శించారు. విభిన్న వినోద, స్పోర్ట్స్ కార్యక్రమాలతో విద్యార్థులంతా సందడిగా గడిపారు.