ఇబ్రహీంపట్నం, ఏప్రిల్ 12 : లంచం తీసుకొంటూ రంగారెడ్డి జిల్లా తుర్కయంజాల్ మున్సిపల్ బిల్ కలెక్టర్ మంగళవారం ఏసీబీ అధికారులకు పట్టుబడ్డాడు. తుర్కయంజాల్కు చెం దిన హర్షవర్ధన్ ఇంటి నంబర్ కేటాయించాలని కోరు తూ బిల్కలెక్టర్ నరేశను సంప్రదించగా డబ్బులు డిమాండ్ చేశాడు.
ఈ క్రమంలో మంగళవారం బాధితుడు హర్షవర్ధన్ నుంచి రూ.20 వేలు లంచం తీసుకొంటుండగా ఏసీబీ అధికారులు రెడ్హ్యాండెడ్గా పట్టుకొన్నారు. నరేశ్ ఔట్సోర్సింగ్ ఉద్యోగి కావటంతో ఈయన వెనుక ఎవరిపాత్ర ఉన్నదనే విషయమై ఏసీబీ అధికారులు మున్సిపల్ కార్యాలయంలో సోదాలు నిర్వహించారు. ఉన్నతాధికారుల ప్రోద్బలంతో ఆయన పలు అవినీతి అక్రమాలకు పాల్పడినట్టు ఏసీబీ అధికారుల దర్యాప్తులో వెల్లడైంది. నరేశ్ను అదుపులోకి తీసుకొని ఏసీబీ కోర్టులో హాజరుపరిచి, ఆ వెంటనే రిమాండ్కు తరలించారు.