నేలకొండపల్లి, మే 5: ఎండ వేడిమి కారణంగా ఓ ద్విచక్ర వాహనం నుంచి మంటలు చెలరేగాయి. ఖమ్మం జిల్లా నేలకొండపల్లిలోని కట్టలమ్మ చెరువు సమీపంలో గురువారం ఈ ఘటన చోటుచేసుకొన్నది. ఖమ్మం వైపు నుంచి కోదాడ వైపు స్కూటీపై దంపతులు వెళ్తుండగా.. పెట్రోలు ట్యాంక్ నుంచి మంటలు రావడాన్ని గమనించారు. వెంటనే అప్రమత్తమై ద్విచక్ర వాహనాన్ని అక్కడే వదిలి పరుగులు తీశారు. అనంతరం స్థానికుల సాయంతో మంటలను ఆర్పివేశారు.